22 Sep 2024
An Unforgivable Offense Against Faith and Devotion – An Article by Abdul Gafoor
అపచారం.. ఘోర అపరాధం.
హైందవ సోదరులు తిరుమలేశుని సన్నిధిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. లడ్డు రూపంలో దొరికే ఆ వేయి నామాల వారి ప్రసాదాన్ని మరింత పవిత్రంగా భావిస్తారు. అటువంటి లడ్డుపై నిర్గాంతపోయే విషయాలను వింటుంటే, కొన్ని రోజులుగా తిరుమల ప్రసాదంపై కొనసాగుతున్న వివాదాలను చూస్తుంటే, అవి కేవలం ఊహాగానాలు, అపనిందలు కాదు అవన్నీ వాస్తవాలే అని చేసిన పరీక్షల్లో నిరూపితమై, ఒళ్ళు గగుర్పొడిచే వాస్తవాలు బయటకు వస్తుంటే ఒక ముస్లింగా నేనే తట్టుకోలేకపోయాను. ఇక హైందవ సోదరుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందనేది నా ఊహకు అందడం లేదు.
ఏ ఇతర మతస్తుడైన ఇంతటి దిగజారుడుతనానికి పాల్పడతాడా అనే ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి. ఇంతటి దుర్మార్గానికి కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా పూనుకుంటాడా..? ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడేవాడిది మనిషి పుట్టుకేనా..? ఇతర మతస్తుల మనోభావాలను కించపరచమని, దెబ్బతీయమని ఏ మతం బోధిస్తుంది..?
కమిషన్ల కోసం ఇంత కక్కుర్తినా..!?
నిజంగా కమిషన్ల కోసమేనా..? లేక ఇతరుల మతవిశ్వాసాలు అంటే చులకన భావమా..!? ఇది ముమ్మాటికి చులకన భావం అనే అర్థమవుతుంది. దీనికి తగు పరిణామాలను చవిచూడక తప్పదు.
ఒక మానసిక రోగికి, కుల పిచ్చి, మత పిచ్చి, డబ్బు పిచ్చి ఉన్న వాడికి అధికారం కట్టబెడితే ఇలాంటి పరిణామాలే మనం చూస్తాం అనేదానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా..? తిరుమల వెంకటేశుని ప్రసాదం పట్ల జరిగిన ఈ ఘోర అపచారమే ఉదాహరణ కాదా..!?
వాడి కులం కల్తీ, వాడి మతం కల్తీ, వాడి మాటలు కల్తీ, పెట్టిన పార్టీ కల్తీ, గడిచిన ఐదు సంవత్సరాలు కొనసాగించిన పరిపాలన కల్తీ, పేదలపై చూపిన ప్రేమ కల్తీ, పేదలకు ఇచ్చిన బియ్యం కల్తీ, అమ్మిన లిక్కర్ కల్తీ, కరోనా సమయంలో జల్లిన బ్లీచింగ్ కల్తీ..... ఆ మనిషే పెద్ద కల్తీ. కల్తీ అనే పదం మానవ రూపం దాల్చితే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపంలో ఉంటుందన్నది వాస్తవం. ఇందులో సందేహం ఎవరికైనా ఉందా..?
ప్రతిదానికి ప్రమాణం చేస్తాను అనేవాడు, ప్రతి మాటకు ముందు, మాట తర్వాత దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు.. అనేవాడికి దైవభీతి అస్సలు ఉండదు. ఇది 100% వాస్తవం.
జగన్ రెడ్డి 2019లో అధికారం చేపట్టినప్పటి నుండి మన రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని వ్యవస్థలను, మాత్రమే బ్రష్టు పట్టించాడు అనుకున్నాము గాని తిరుమల దేవస్థానంలో ఇంతటి ఘోర అపచారానికి పాల్పడతాడని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. జగన్ రెడ్డి పాలనలో రధాలు తగలబడితే "తేనెటీగలు తగలబెట్టాయి" అన్నాడు. రామతీర్థం లోని శ్రీరాముల వారి విగ్రహం తలను తొలగిస్తే "అల్లరిమూకల పని" అన్నాడు. బెజవాడ దుర్గమ్మ వెండి సింహాలు దొంగలించబడితే "వచ్చిన నష్టం లేదు కొత్తవి చేయిద్దాం" అని చెప్పించాడు, గుళ్ళపై, గోపురాలపై దాడులు జరిగితే "పిచ్చివారు చేసారు" అని చెప్పారు. వీటన్నిటినీ మించి ఇప్పుడు బయటపడ్డ ఏడుకొండలవారి ప్రసాదం పట్ల ఘోర అపచారం.
ఇంతటి దారుణ మనస్తత్వం ఉన్న వ్యక్తిని ఇప్పటి వరకు వెనకేసుకు వచ్చిన కొందరు మేధావులు, పండితులు, మత గురువులారా..! ఇప్పుడు దీనిపై ఏం సమాధానం ఇస్తారు..? ఇలాంటి వారిని వెనకేసుకు వచ్చిన మీకు ఈ పాపంలో భాగం ఉండదా..?
ఇంతటి నీచానికి పాల్పడ్డవాడు కడుపుకు తినేది అన్నం కాదు అశుద్ధం అనే చెప్పాలి. ఇతర మతాలను, వారి మత విశ్వాసాలను, మత ఆచార-వ్యహారాలను గౌరవించలేని వాడు పాలకూడిగా అర్హుడేనా..?
ఇలాంటి వికృతమైన పనులతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, హైందవ ధర్మాన్ని అవహేళన చేసేవిధంగా, వారి పవిత్రతను భంగం కలిగించినవారికి ఏవిధమైన శిక్ష విధించాలి..?