Articles

Is There a Political Silence Around Good Governance? – An Article by Abdul Gafoor

తెలుగుదేశం పార్టీకి శాపం ఉందా..? ముస్లిం మైనారిటీల కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేసింది.. అంటే ఏ ఇతర పార్టీలు చేయనంత మంచిని చేసింది అని ఘంటాపదంగా చెప్పగలను. కానీ తెలుగుదేశం పార్టీకి ఉన్న పెద్ద లోపం చేసింది చెప్పుకోకపోవడం. ఒక ముస్లిమ్ సామాజిక వర్గానికే కాదు ప్రతి వర్గానికి మంచి జరిగింది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ లోనే జరిగింది అని కచ్చితంగా చెప్పాలి. కానీ నాయకులు మరెందుకో దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళరు. చేసింది చెప్పుకుంటే దిష్టి తగులుతుందా..? లేక పరశురాముడు కర్ణుడికి ఇచ్చిన శాపంలా.. మనం చేసిన మంచి చెప్పుకోకుండా మరచిపోవాలని ఏదైనా శాపం ఉందా..? ఇది బ్రహ్మ రహస్యంగా ఉంది. ఇతర పార్టీల వారు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పని చేస్తే 100 పనులు చేసినట్టుగా చెప్పుకుంటారు కానీ మనం (తెలుగుదేశం) మాత్రం 100 మంచి పనులు చేసినా ఒక్కటి కూడా చెప్పుకోం. ఎందుకో..!? ఇలాంటి కారణాలతోనే కదా అరాచకుల చేతిలో, ఉన్మాదుల చేతిలోకి మన రాష్ట్ర పాలన వెళుతున్నది. దీనివల్ల మన తెలుగు జాతి నష్టపోతుంది. 2019 ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత అయినా మార్పు వస్తుందని భావించా.. అబ్బే మనం మారం గాక మారం.. మేమింతే..! ఉర్దూలో ఒక సూక్తి ఉంది "నేకి కర్ దరియా మే దాల్" అని అలా అనుకోవడానికి ఇక్కడ జరుగుతుంది పాప పుణ్యాల వేట కాదు. ఇది రాజకీయ చదరంగపు ఆట కాబట్టి "నేకి కర్ సోషల్ మీడియా మే దాల్" అని పాటించాల్సిందే.. తప్పదు..! అరె మొన్నటికి మొన్న తల్లికి వందనం పేరుతో విద్యార్థులు ఉన్న ప్రతి కుటుంబానికి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి పధకం అమలు పరిచినా దాన్ని కూడా మనం ఎందుకో చెప్పుకోలేకపోతున్నాం. గత జగన్ రెడ్డి పాలనలో అరాచకాల వలన ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థికసాయం మన తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా అందబోతుంది. జగన్ రెడ్డి ఆపిన ఇమామ్ మౌజ్జన్ ల గౌరవ వేతనాలను చంద్రబాబు గారు అందించారు దీనిపై మాట్లాడరు. ఇలా ఎన్నో ఎన్నెన్నో........ కానీ మనం మారం.