Articles
From Arrest to Courtroom: The Ongoing Legal Battle of Farooq Shubli - An Article by Abdul Gafoor
సంచలనం సృష్టించిన కడప జిల్లా బద్వేలు కోర్టు ఫారూఖ్ షిబ్లీ హత్య యత్నం కేసు అప్డేట్స్.. కడపకు రావాలంటే మాజీ సీఎం జగన్ గారి పాస్పోర్ట్ మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ భాష వీసా ఏమైనా కావాలా..? పోరాట యోధుడు ఫారూఖ్ షిబ్లీ గారికి ఆపద్బాంధవుడు జి.ఎస్. మూర్తి గారు ప్రముఖ సీనియర్ న్యాయవాది/Ex. పబ్లిక్ ప్రాసిక్యూటర్, & తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (కడప). గత వైసీపీ ప్రభుత్వంలో వేధింపులు తాళలేక నంద్యాలకు చెందిన అబ్దుస్ సలాం కుటుంబ సమేతంగా ఆత్మహత్య (రైలు పట్టాలపై) చేసుకున్న ఉదంతం తర్వాత కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన అక్బర్ బాషా అనే వ్యక్తి తాను 48 గంటల్లో ఆత్మహత్య చేసుకుంటున్నా అంటూ వదిలిన వీడియో వైరల్ అవ్వడంతో అబ్దుస్ సలాం లాంటి మరో ఘటన చోటు చేసుకోకూడదని అతన్ని కలిసి పరామర్శించేందుకు వెళుతున్న ఫారూఖ్ షిబ్లి గారిని మార్గ మధ్యలో అరెస్టు చేసి తప్పుడు కేసును (11/09/2021) నమోదు చేసి 5 రోజులపాటు కడప జైలులో ఉంచిన విషయం తెలిసినదే. ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారు అనుక్షణం వివరాలను ఆరాతీస్తూ ఫారూఖ్ షిబ్లి గారు బయటకు వచ్చే వరకు చూపిన చొరవ మరువలేనిది. బద్వేలు కోర్టులో తనపై ఉన్న కేసు వాయిదాకు ఈరోజున ఫారూఖ్ షిబ్లి గారు హాజరయ్యూరు. ఈ కేసును తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (కడప), అడ్వకేట్ జి.ఎస్. మూర్తి గారు వాదిస్తున్నారు. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అరాచకాలు రాష్ట్ర ప్రజలు మరచిపోకపోయినా.. న్యాయం వైపు నిలబడిన వారిని, ప్రశ్నించిన వారిని, పరామర్శలకు వెళుతున్న వారిపై కూడా హత్యా యత్నం కింద కేసులను నమోదు చేసిన ఘనత ఒక్క వైసీపీ వారికి మాత్రమే దక్కుతుంది. అది వైసీపీ హయంలోనే చెల్లింది. ఫారూఖ్ షిబ్లి వేసే ప్రతి అడుగు తమకు (వైసీపీ) ప్రతికూలంగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని భావించి.. కక్షపూరితంగా షిబ్లి గారి ఆశయాలను తొక్కాలని, ముస్లిం మైనారిటీలలో తీసుకువస్తున్న చైతన్యాన్ని నీరుగార్చాలని, భయపెట్టాలని చూస్తే.. ఆయనలో మరింత 'కసి' కసి-కసిగా పెరిగింది. ఈరోజు బద్వేల్ కోర్టు హాల్లో సీనియర్ న్యాయవాది మూర్తి గారు వాదిస్తూ పోలీసులు నా క్లైంట్ ఫారూఖ్ షిబ్లీ గారిని ఆపితే కడపకు రావాలంటే ముఖ్యమంత్రి గారి పాస్పోర్టు ఉప ముఖ్యమంత్రి గారి వీసా కావాలా..? అన్న మాటలకు కోర్టు హాలు మొత్తం ఒక్కసారిగా ఫారూఖ్ షిబ్లీ గారి వైపుకు చూస్తూ నవ్వులు చిందించారు. న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ, లా అబాయ్డింగ్ సిటిజన్గా వాయిదాలకు క్రమం తప్పకుండా సామాన్య వ్యక్తిగా ఫరూఖ్ షిబ్లీ హాజరుతున్నారు, మరి ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కోర్టు వాయిదాలకు 10 సం||ల నుండి ఎందుకు కావటంలేదు?