Articles
Participation in the 20th World Minority Rights Day and Advocacy for Urdu Education Reforms – An Article by Abdul Gafoor
ప్రపంచ మైనారిటీ హక్కుల దినోత్సవంలో పాల్గొన్న జనాబ్ మొహమ్మద్ ఫరూక్ షిబ్లీ. 20వ వార్షిక ప్రపంచ అల్పసంఖ్యకుల హక్కుల దినోత్సవానికి ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వం తరపున జాతీయ స్థాయిలో నిర్వహించిన కార్యక్రమానికి మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర విద్య & మానవవనరుల శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ గారు, NCMEI (నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్) జాతీయ సభ్యులు డాక్టర్ షాహిద్ అఖ్తర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు Mohammed Farooq Shubli గారు NCMEI జాతీయ సభ్యులు డాక్టర్ షాహిద్ అఖ్తర్ గారికి ఆంధ్రరాష్ట్ర లాంగ్వేజ్ ఉర్దూ టీచర్ల నియామకం చేయాలని, ఉర్దూ మాధ్యమంలో అంగన్వాడి కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా స్థాపించాలని, రాష్ట్రంలో ఉర్దూ మాధ్యమంలో నూతన జిల్లాల్లో డైట్ కాలేజీలు ప్రారంభించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించటం జరిగింది. ఈ సందర్భంగా NCMEI జాతీయ సభ్యులు డాక్టర్ షాహిద్ అఖ్తర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా Mohammed farooq shubli గారు మాట్లాడుతూ ఇటువంటి సదవకాశాన్ని కల్పించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మైనారిటీ & న్యాయశాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ NMD ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం రాష్ట్రీయ మంచ్ నాయకులు ఇంద్రేష్ కుమార్ గారు, నేషనల్ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్, మొహమ్మద్ ఫరూక్, ప్రొఫెషన్ డాక్టర్ ఫేజాన్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.