Articles
A Movement Beyond Politics: The Expanding Strength of MHPS – An Article by Abdul Gafoor
వేదికపై ముఖ్య అతిథులుగా రాజకీయ ప్రముఖులు లేరు, మత బోధకులు మత ప్రచారకులు లేరు, ప్రేరణాత్మక వక్తలు లేరు. అయినా సరే జనవరి 26న విజయవాడ లోని 'షా - జహూర్ ముసాఫిర్ ఖానా' కిట-కిట లాడింది. జనాలతో కిక్కిరిసింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి 8వ వార్షికోత్సవం జరుగుతున్న వేళ రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల నుంచి దాదాపు 1000 మంది ఎంహెచ్పీఎస్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో 65 నుంచి 80 నియోజకవర్గాల్లో ఎంహెచ్పిఎస్ సంస్థ సభ్యులు ఉన్నారు. ఇది సంస్థ యొక్క పనితీరును అద్దంపడుతుంది. 2017 లో మొదలైన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ప్రజల పక్షాన మరీ ముఖ్యంగా పేదల పక్షాన నిలబడుతూ ప్రజల గొంతుకై వారి హక్కుల సాధనకై ప్రజా శ్రయస్సు కోసం వారి హక్కుల కోసం, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం అధికారపక్షాన్ని నిలదీస్తూ ఎన్నో విజయాలను సాధిస్తూ వచ్చింది. అధికార మార్పిడిలో తన పాత్రను సైతం విజయవంతంగా పోషించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలో సంస్థ అధ్యక్షులు జనాబ్ ఫారూఖ్ షిబ్లి (Mohammed Farooq Shubli) గారిని అక్రమ అరెస్టు చేయడం, ఆయనకు అనేక బెదిరింపు కాల్స్ రావడం షరా మామూలే అయ్యింది. ఇంతేకాదు ఇప్పటికీ కొందరు ఎంహెచ్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుల వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ తలమాసిన చెత్తగాళ్ళు సోషల్ మీడియా వేదికగా పెట్టే పోస్టులను, చేసే వీడియోలను మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. ఆ పోస్టులు, వారి చెత్త వీడియోలు చెబుతాయి ఎంహెచ్పిఎస్ సంస్థ ఎదుగుదల ఏపాటిదో అని, సంస్థపై పనికిమాలినవారి అక్కసు ఏపాటిదో అని. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలలో మరీ ముఖ్యంగా దళిత మరియు ముస్లిం మైనారిటీలలో రాజకీయ చైతన్యాన్ని నింపుతూ తమ ఓటు విలువను తెలుసుకునేలా చేయడంతో పాటుగా తమ హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి అనే ప్రత్యేక అంశాలతో కూడిన సభలపై ప్రత్యేక దృష్టిని సారించింది. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ బాధితులకు అండగా ఉంటూ నాటి అధికార పక్షానికి ఒక రకంగా సింహస్వప్నంలా మారింది అనడానికి సంకోచమే లేదు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఏ ఒక్క వర్గానికి పరిమితం కాకుండా కులమతాలకు, వర్గ-వర్ణాలకు అతీతంగా అందిస్తూ వచ్చిన సేవలను చూస్తే.. మతసామరస్యాన్ని పెంపొందిస్తూ, సోదర భావాన్ని నెలకొల్పే విధంగా అయ్యప్ప మాల ధరించిన స్వాములకు సద్ది, భిక్ష ఏర్పాట్లు చేయడం, ప్రతి సంవత్సరం దసరాలో జరిగే బెజవాడ కనకదుర్గ ఉత్సవాలకు హాజరయ్యే ఆశేష జనావాహిని దృష్టిలో పెట్టుకొని బారులు తీరే దుర్గమ్మ భక్తులకు సేవలను అందిస్తూ మజ్జిగ పంపిణీ చేయడం ఇలాంటి ఎన్నో సేవలు అందించడం వల్ల మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కుల, మతాలకు అతీతంగా అనేక హృదయాల్లో అభిమానాన్ని దక్కించుకుంది. తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించగలిగింది. ప్రజలకు కష్టం వచ్చిన చోటుకు చేరుకోవడం, బాధితులకు పీడితులకు అండగా ఉండడం, బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాటాన్ని కొనసాగించడం. ఇలాంటి అనేక సేవల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సేవలకు ఆకర్షితులైన వారివల్ల నేటికి 35 వేల మంది సభ్యులను సంపాదించుకోగలిగింది. ఈ సంవత్సరం 2025 పూర్తయ్యే నాటికి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది సభ్యులు తమ లక్ష్యంగా ముందుకు సాగుతుంది. ఎనిమిదవ సంవత్సరంలో అడుగుపెట్టిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సంస్థ కుటుంబ సభ్యులకు మరియు సంస్థ రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షిబ్లి (Mohammed farooq shubli) గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ 2029 వరకు కార్యచరణలో భాగంగా రూపొందించిన మేనిఫెస్టోలోని ప్రతి అంశంలో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. #మరి_కొంతకాలంలో_జరగబోయే స్థానిక ఎన్నికలకు గాను ఇప్పటికే రూపొందించుకున్న అద్భుతమైన ప్రణాళికలో ఘన విజయం సాధిస్తారనే ధృడ నమ్మకంతో ఉన్నాను. 2029 ఎన్నికలకు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి బలం పదింతలు పెరుగుతుందని పూర్తి విశ్వాసంతో ఉన్నాను. 80 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములు ఏకపక్షంగా ఉండబోతున్నాయని ఘంటాపథంగా............... మొక్కగా మొలిచి వృక్షంగా మారిన మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి మైనారిటీలు, దళితులు, బడుగు బలహీనవర్గాలకు తన నీడనిస్తూ మహావృక్షంగా తన సేవలను అందిస్తూ విస్తృత రూపం దాల్చబోతుంది. ప్రస్తుతం మన సమాజంలో.. ఒక వ్యక్తి లేదా ఒక సంస్థ నలుగురికి ఉపయోగపడుతూ ఉన్నత సమాజ నిర్మాణానికి నిర్దేశించుకున్న లక్ష్యాలకు చేరుకునే దశలో ఎంతోమంది చేత మన్ననలు పొందుతారు, దీవెనలు అందుకుంటారు అదే సమయంలో కొందరి కడుపు మంటను సైతం ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి కొందరు ఉచ్ఛ నీచాలు మరిచి దిగజారుడుతనంతో తమ అసమర్ధతను విషం రూపంలో కక్కుతుంటారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సంస్థ ఎదుగుదల, చిన్న వయసులోనే ఆ సంస్థ అధ్యక్షుడికి పెరుగుతున్న ప్రజాదరణ చూసి కొందరు ఓర్వలేక, వారితో పోటీ పడలేక, ఇది జీర్ణం చేసుకోలేక కడుపు ఉబ్బరంతో వారి కడుపులో పేరుకుపోయిన విషవాయువును ముందు నుండి వదిలే ధైర్యం లేక వెనక నుండి వదులుతూ సమాజాన్ని గబ్బు పట్టిస్తారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సంస్థ మరియు అధ్యక్షులవారు అంటారు.. తగ్గేదే..లే..! అని. మనం విజయవంతం అవ్వాలంటే..? ఆ మాత్రం ఏడుపులు ఉండాలి. కదా..!?