Articles
A Historic Shift: Minority Support and the 2024 Electoral Mandate – An Article by Abdul Gafoor
అద్భుతం, అద్వితీయం, అనిర్వచనీయం, చిరస్మరణీయం. 2024 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.. అహంకారానికి, అరాచకానికి, విధ్వంసానికి తోలు ఒలిచారనే చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఎన్నడు లేని విధంగా ముస్లిం మైనార్టీల ఓటు శాతం ఈసారి తెలుగుదేశం పార్టీ వైపు మళ్లడం నాయకులను అబ్బురపరిచిందనే చెప్పాలి. దాదాపుగా 60 నుండి 65 శాతం ముస్లిం మైనారిటీలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అనే ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు పిలుపుమేర కూటమి అభ్యర్థులకే పట్టం కట్టారనడంలో సందేహమే లేదు. దీనికి 100 ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం రెండు మూడు ఉదాహరణలు చూద్దాం.. ముస్లిం మైనారిటీలు అత్యధికంగా ఉన్న ఆదోనిలో కూటమికి సంబంధించిన బీజేపీ అభ్యర్థి గెలవడం మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి కూటమికి సంబంధించిన బీజేపీ అభ్యర్థి గెలవడం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటక భావించే రాయలసీమ ప్రాంతంలో సైతం తెలుగుదేశం పార్టీ తిరుగులేని విజయ బావుటాను ఎగరవేయడం. ముస్లిం మైనారిటీల ఓట్లు లేకుండా రాయలసీమ మరియు గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఇంతటి విజయం సాధ్యం కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్థులకు ఏడు స్థానాలను కేటాయిస్తే ఆ ఏడు స్థానాలలోని వైసీపీ అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మూడు స్థానాల్లోని ముస్లిం అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించడం మరో ఉదాహరణ. ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా 70 నియోజకవర్గాల్లో 30 వేలకు పైబడి ముస్లిం మైనారిటీల ఓటు ఉన్న సంగతి మనందరికీ తెలిసినదే. అటువంటి ప్రాంతాల్లో సైతం వైసీపీ గెలవకపోగా.. ముక్కుతూ మూల్గుతూ 175 స్థానాలకు గాను 11 స్థానాలు మాత్రమే సాధించిందంటే..? ముస్లిం మైనారిటీలు తెలుగుదేశం పార్టీని ఆదరించిన విధానం, చంద్రబాబు గారిపై నమ్మకంతో కూటమి అభ్యర్థులను అక్కున చేర్చుకున్న విధానం 👌👌👌. ఇదే సమయంలో మైనారిటీల నమ్మకాన్ని, ఓటు బ్యాంకును నిలుపుకుంటూ రాబోవు కాలంలో మైనారిటీల ఓట్ పర్సంటేజ్ పెంచుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైనే ఉంది. తెలుగుదేశం పార్టీ నామినేటెడ్ పోస్టులలో ముస్లిం మైనార్టీలకు తగు ప్రాధాన్యత నివ్వాలి. రాయలసీమలో తెలుగుదేశం పార్టీ తరపున ఇద్దరు శాసనసభ్యులుగా ఎన్నిక కాగా (యన్.యం.డి ఫారూఖ్, షాజహాన్) వారిలో ఒకరికి మంత్రి పదవి దక్కడం ఆనందకరమైన విషయం. ఇక కోస్తా ఆంధ్ర నుండి ఉత్తరాంధ్ర వరకు చూస్తే ఒక్క మైనారిటీ వ్యక్తి (మహమ్మద్ నసీర్ అహ్మద్ - గుంటూరు తూర్పు) మాత్రమే అవకాశం దక్కగా ఆయన కూడా శాసనసభ్యునిగా గెలవడం జరిగింది. రాయలసీమ తర్వాత గుంటూరు కృష్ణాజిల్లాలో అత్యధిక ముస్లిం జనాభా ఉన్నారు కనుక ఈ ప్రాంతంలో బలమైన ముస్లిం నాయకున్ని తయారు చేసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎంతైనా ఉంది. అంతేకాకుండా పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలను చూస్తే రాయలసీమలో లాగా మరియు కృష్ణ గుంటూరు జిల్లాల్లో మాదిరి ముస్లిం మైనార్టీల అత్యధిక జనాభా లేకపోయినా వారి ప్రభావమైతే ఎంతో కొంత ఉంది. ఈ ఐదు ఉమ్మడి జిల్లాలలో కలిపి ఉత్తరాంధ్ర విశాఖపట్నం నుండి ఒక మైనారిటీ నాయకున్ని తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా 100% ఉంది. ముస్లిం మైనారిటీలకు పదవులు అనగానే వక్ఫ్ బోర్డ్, హజ్ కమిటీలు అనేలా కాకుండా.. అన్ని విభాగాల్లో దామాషా ప్రకారంగా అవకాశాలు కల్పిస్తేనే మైనార్టీలలో నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ పెంపొందించగలదు. ఇకమీదట మైనారిటీల ఓటు బ్యాంక్ కు నో డౌట్. దీనికి కొనసాగింపుగా వచ్చే ఆదివారం పోస్ట్ చేస్తాను ఇప్పటికే మేటర్ పెద్దదిగా ఉండడంతో ముగిస్తున్నాను.